వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ పాలనపై గ్రామాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఈసారి పల్లెల నుంచే తిరుగుబాటు మొదలవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇచ్చిన మాట తప్పి రైతుబంధు ఎగ్గొట్టారని, కరెంట్, యూరియా ఇవ్వకుండా రైతులను గోస పెడుతున్నారని మండిపడ్డారు.
గత ఎన్నికల్లో పొరపాటున కాంగ్రెస్కు ఓటేసిన ప్రజలు ఇప్పుడు ఆ పార్టీని తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు వడ్డీతో సహా చెల్లిస్తామని ముషీరాబాద్ బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కేటీఆర్ స్పష్టం చేశారు.
Comments
Loading comments...
