Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కశ్మీర్‌లో ఉగ్ర కుట్ర భగ్నం

మానస శర్మ Jul 09, 2026 11:38 AM అల్ ఇండియా 8 viewsabout 2 hours ago
కశ్మీర్‌లో ఉగ్ర కుట్ర భగ్నం - Udayam Digital
దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో ఐదు రోజులుగా ఉమ్మడి బలగాలు జరిపిన భారీ ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ జాకీర్ గనాయ్ హతమయ్యాడు. దీంతో అమర్‌నాథ్ యాత్రే లక్ష్యంగా పన్నిన ఒక పెద్ద ఉగ్ర కుట్రను భద్రతా దళాలు విజయవంతంగా తిప్పికొట్టాయి. ఘటనా స్థలం నుండి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. తప్పించుకున్న మరో ఉగ్రవాది లతీఫ్ కోసం ఆర్మీ, సీఆర్‌పీఎఫ్, పోలీసులు ప్రస్తుతం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలను మరింత తీవ్రం చేశారు.

Comments

G
Loading comments...