వార్తలకు తిరిగి వెళ్లండి
కన్నూర్లో ఘోర ప్రమాదం: నలుగురు మృతి

కేరళలోని కన్నూర్ జిల్లా చలోడ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి వస్తున్న కారు అతివేగంతో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించారు.
మృతులను ఉత్తరప్రదేశ్కు చెందిన పరమ్ ఛెత్రి, హర్ష్.. కేరళకు చెందిన రిజ్వాన్, షాన్లుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన మరో ప్రయాణికుడి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Comments
Loading comments...