Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేవలం రూ.55 లకే 'జియోటీవీ ప్రో'

మహేష్ కుమార్ Jul 17, 2026 12:16 PM అల్ ఇండియా 10 viewsabout 1 hour ago
కేవలం రూ.55 లకే 'జియోటీవీ ప్రో' - Udayam Digital
టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం రూ.55 లకే 'జియోటీవీ ప్రో' (Jio TV Pro) ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్యాక్ ద్వారా 30 రోజుల పాటు 1,000 కి పైగా లైవ్ టీవీ ఛానెళ్లను మొబైల్‌లోనే వీక్షించవచ్చు. ఇందులో 16 భాషలకు చెందిన 150 ప్రీమియం ఛానెళ్లు కూడా అందుబాటులో ఉంటాయి. జియో ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ యూజర్లు ఈ ఆఫర్‌ను పొందవచ్చు. అయితే స్పోర్ట్స్ ఛానెళ్లు మాత్రం ఇందులో ఉండవు.

Comments

G
Loading comments...