వార్తలకు తిరిగి వెళ్లండి
జేబీఎం ఎలక్ట్రిక్ బస్సుల పునఃప్రారంభం

బ్యాటరీ పేలుళ్ల కారణంగా ఆర్టీసీ నిలిపివేసిన 500 జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులు తెలంగాణలో మళ్లీ రోడ్డెక్కాయి. చైనా సాంకేతిక బృందం వీటిని క్షుణ్ణంగా పరీక్షించిన అనంతరం, ఫిట్నెస్ బాగున్న 150 బస్సులను నిన్న జేబీఎస్ నుండి వివిధ జిల్లాలకు పునరుద్ధరించారు.
మిగిలిన 350 బస్సుల ఫిట్నెస్పై ప్రస్తుతం ముమ్మరంగా తనిఖీలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రయాణికుల భద్రతను పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే మిగతా బస్సులను సైతం దశలవారీగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి.
Comments
Loading comments...