వార్తలకు తిరిగి వెళ్లండి
బద్రీనాథ్ ఆలయ విరాళాల అక్రమాలపై ఉన్నతస్థాయి విచారణ

బద్రీనాథ్ ఆలయ విరాళాల నిర్వహణలో జరిగిన అవకతవకలపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారంపై నిజానిజాలు తేల్చేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఆలయంలో పారదర్శకత పెంచేందుకు ఈ చర్యలు చేపట్టారు. ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ ప్రారంభించగా, ప్రాథమిక ఆధారాలతో ప్రమోద్ నౌట్యాల్ అనే ఉద్యోగిని అధికారులు సస్పెండ్ చేశారు.
Comments
Loading comments...