వార్తలకు తిరిగి వెళ్లండి
భారత్ టాక్సీ విస్తరణ: రెండేళ్లలో 500 నగరాలకు
జయ ప్రకాష్ Jun 27, 2026 9:03 AM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago

రెండేళ్లలో 'భారత్ టాక్సీ' సేవలను దేశవ్యాప్తంగా 500 నగరాలకు విస్తరిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. డ్రైవర్లను వాటాదారులుగా మారుస్తూ, వారికి ఎక్కువ ఆదాయాన్ని కల్పించడమే ఈ కో-ఆపరేటివ్ ప్లాట్ఫామ్ లక్ష్యమని ఆయన తెలిపారు.
ప్రస్తుత ప్రైవేట్ యాప్లు డ్రైవర్లను దోచుకుంటున్నాయని షా విమర్శించారు. అముల్ తరహాలో సహకార స్ఫూర్తితో సాగుతున్న ఈ నూతన వేదిక, ప్రయాణికులకు సురక్షితమైన, సరసమైన ప్రయాణ సదుపాయాలను అందిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Comments
Loading comments...