వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ విద్య.. ఏపీ గ్లోబల్ ప్లాన్

సింగపూర్, ఫిన్లాండ్ దేశాలకు ఉపాధ్యాయులను పంపి అంతర్జాతీయ ప్రమాణాలతో ఏపీ విద్యావ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. దేశమంతా ఏపీ మోడల్ గురించి మాట్లాడుకోవడమే తన లక్ష్యమన్నారు.
తాడేపల్లిలో టెన్త్, ఇంటర్ టాపర్లకు ల్యాప్టాప్లు, నగదు బహుమతులు అందజేసి సత్కరించారు. వచ్చే ఏడాది రెండు లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ నుండి ప్రభుత్వ బడుల్లోకి మారాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...