వార్తలకు తిరిగి వెళ్లండి
కంగారూల గడ్డపై భారత రఫేల్ గర్జన

భారత వైమానిక దళానికి చెందిన నాలుగు రఫేల్ యుద్ధ విమానాలు అంతర్జాతీయ సమరానికి సిద్ధమవుతూ ఆస్ట్రేలియా చేరుకున్నాయి. ప్రతిష్టాత్మక బహుళ పక్ష 'పిచ్ బ్లాక్' సైనిక విన్యాసాల్లో ఇవి తమ యుద్ధ సత్తాను ప్రదర్శించనున్నాయి.
సుమారు 19 దేశాల భాగస్వామ్యంతో జూలై 20 నుండి ప్రారంభం కానున్న ఈ మెగా ఈవెంట్ ఆగస్టు 7 వరకు కొనసాగనుంది. ఇందులో వందకు పైగా యుద్ధ విమానాలు, 2500 మంది సిబ్బంది పాల్గొంటున్నారు.
Comments
Loading comments...