Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వేలో పెరిగిన జరిమానాలు

Follow Udayam on Google
Sanjay Jun 22, 2026 11:23 AM హైదరాబాద్General
రైల్వేలో పెరిగిన జరిమానాలు - Udayam
రైల్వే నిబంధనల ఉల్లంఘనపై ఆర్పీఎఫ్ జరిమానాలు పెంచింది. భిక్షాటనకు రూ.2 వేలు, టికెట్ లేకుండా ప్రయాణిస్తే రూ.500, మహిళా కోచ్‌లోకి పురుషులు ప్రవేశిస్తే రూ.2,500 మరియు ప్రమాదకర వస్తువులకు రూ.10 వేల వరకు జరిమానా విధిస్తారు. జరిమానా చెల్లించని వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు పంపిస్తారు. ప్రయాణికుల భద్రత, క్రమశిక్షణ కోసం 'జన విశ్వాస్' చట్టం ద్వారా ఈనెల 15 నుంచి ఆర్పీఎఫ్‌కు జరిమానాలు వసూలు చేసే అధికారాన్ని ప్రభుత్వం కల్పించింది.

Comments

G
Loading comments...