Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వే బాధితులకు భారీ ఊరట

అమరేష్ గౌడ్ Jul 18, 2026 12:37 PM అల్ ఇండియా about 2 hours ago
రైల్వే బాధితులకు భారీ ఊరట - Udayam Digital
రైలు ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలకు సుప్రీంకోర్టు భారీ ఊరటనిస్తూ చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ప్రమాద సమయంలో రైలు టికెట్ లభించలేదనే సాంకేతిక కారణాన్ని చూపుతూ బాధితుల కుటుంబాలకు పరిహారం నిరాకరించడానికి వీల్లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. రైల్వే చట్టాలు అనేవి ప్రజల సంక్షేమం కోసమేనని సుప్రీంకోర్టు గుర్తుచేసింది. ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవాలే తప్ప, చిన్నపాటి కారణాలతో చేతులు దులుపుకోవడం సరికాదని కోర్టు గట్టిగా నొక్కి చెప్పింది.

Comments

G
Loading comments...