Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంట్లో కాన్పు ప్రయత్నం: తల్లి మృతి

జయ ప్రకాష్ Jun 30, 2026 9:39 AM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago
ఇంట్లో కాన్పు ప్రయత్నం: తల్లి మృతి - Udayam Digital
తమిళనాడులో ఇంటి వద్దే సాధారణ కాన్పు చేయాలన్న కుటుంబసభ్యుల నిర్ణయం విషాదంగా ముగిసింది. తీవ్ర రక్తస్రావం కావడంతో శశికళ అనే గర్భిణి ప్రాణాలు కోల్పోగా, బిడ్డ మాత్రం సురక్షితంగా బయటపడింది. మందుల పట్ల అలర్జీ కారణంగా ఆమె ఇంట్లోనే కాన్పుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు శశికళ భర్తపై కేసు నమోదు చేసి, ఘటనకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర దర్యాప్తు చేపడుతున్నారు.

Comments

G
Loading comments...