వార్తలకు తిరిగి వెళ్లండి
కుండపోత వర్షాలు.. కేదార్నాథ్ యాత్రకు బ్రేక్

కుండపోత వర్షాల వల్ల కేదార్నాథ్ పాదయాత్ర మార్గంలోని గౌరీకుండ్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో యాత్రికుల భద్రత నిమిత్తం అధికారులు కేదార్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసి, శిథిలాల తొలగింపు చర్యలు చేపట్టారు.
వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేయడంతో భక్తులు తమ యాత్రను వాయిదా వేసుకోవాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది. మార్గం సురక్షితమైన తర్వాతే అనుమతిస్తామని స్పష్టం చేసింది.
Comments
Loading comments...