వార్తలకు తిరిగి వెళ్లండి

మూసీ రివర్ఫ్రంట్ అభివృద్ధిలో భాగంగా ‘గాంధీ సరోవర్’ ప్రాజెక్టుకు కేంద్రం అనుమతినిచ్చింది. బాపూఘాట్ వద్ద 83 ఎకరాల రక్షణ శాఖ భూమిని అభివృద్ధి పనులకు వినియోగించుకునేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ వర్కింగ్ పర్మిషన్ మంజూరు చేసింది.
రూ.533 కోట్ల విలువైన ఈ భూమి బదులుగా రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలను కల్పించాలనే షరతుతో క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చర్యలు చేపట్టింది.
Comments
Loading comments...
