వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రభుత్వ పాఠశాలకే పిల్లలు
జయ ప్రకాష్ Jun 23, 2026 10:39 AM మేడ్చల్ మల్కాజిగిరి 6 viewsabout 3 hours ago

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రత్నాపూర్ గ్రామస్తులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. గ్రామంలోని పాఠశాలలో నాణ్యమైన విద్య, సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని సర్పంచ్ గొండ రాజేందర్ తెలిపారు.
ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లకుండా తమ పిల్లలను ప్రభుత్వ బడికే పంపాలని వీడీసీ, పేరెంట్స్ కమిటీతో కలిసి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...