వార్తలకు తిరిగి వెళ్లండి
వరద విలయం.. ఏనుగులే ఆసరా

అరుణాచల్ ప్రదేశ్లో సంభవించిన ఆకస్మిక వరదలకు రోడ్డు మార్గాలు పూర్తిగా కొట్టుకుపోవడంతో, సహాయక సామగ్రిని చేరవేయడానికి అధికారులు ఏనుగులను ఆశ్రయించారు. సుమారు 12 కొండ ప్రాంత గ్రామాలకు ఇంధనం, మందులను ఇవి మోసుకెళ్తున్నాయి.
ఇటీవలి ప్రకృతి విపత్తులో రాష్ట్రవ్యాప్తంగా లక్ష మందికి పైగా ప్రభావితం కాగా, 12 మంది మరణించారు. ఈ తీవ్ర నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని మానవ హక్కుల సంఘాలు కేంద్రాన్ని కోరాయి.
Comments
Loading comments...