Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూకట్‌పల్లి ఏటీఎంలో అగ్నిప్రమాదం

వైష్ణవి శర్మ Jun 29, 2026 4:10 AM హైదరాబాద్ 5 viewsabout 3 hours ago
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి వడ్డేపల్లి ఎన్‌క్లేవ్‌లో ఉన్న డీబీఎస్ (DBS) ఏటీఎంలో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఏటీఎం కేంద్రం నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు, మంటలు చెలరేగడాన్ని స్థానికులు గమనించారు. వెంటనే అప్రమత్తమైన వారు మంటలను ఆర్పేందుకు ప్రాథమికంగా ప్రయత్నించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...