వార్తలకు తిరిగి వెళ్లండి
భారత్కు చేరనున్న ఎరువుల నౌకలు

Photo Gallery
పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య భారత్కు అవసరమైన ఎరువులతో వస్తున్న 15 నౌకలు హార్ముజ్ జలసంధిని క్షేమంగా దాటాయని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. మరో ఐదు నౌకలు త్వరలోనే బయలుదేరనున్నాయి.
మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ, అంతరాయాలు ఉన్నప్పటికీ రైతుల ప్రయోజనాలను రక్షించామన్నారు. ప్రస్తుతం దేశీయంగా 51 శాతానికి పైగా వార్షిక ఎరువుల అవసరాలకు సరిపడా నిల్వలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు.
Comments
Loading comments...