వార్తలకు తిరిగి వెళ్లండి
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మహేశ్కుమార్గౌడ్

రైతు సంతోషమే రాష్ట్ర అభివృద్ధికి మూలమని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో ఆర్థిక భారాన్ని సైతం లెక్కచేయకుండా, అన్నదాతల కోసం ప్రభుత్వం రైతు భరోసా నిధులను పంపిణీ చేసిందని ఆయన తెలిపారు.
వ్యవసాయాభివృద్ధితోనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందనే దృఢ విశ్వాసంతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఆయన స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలే తమ పార్టీకి అత్యంత ప్రాధాన్యమని ఆయన పునరుద్ఘాటించారు.
Comments
Loading comments...