వార్తలకు తిరిగి వెళ్లండి
ఇథనాల్తో దేశీ సంపద ఆదా

మురు దిగుమతుల ఖర్చును తగ్గించి, దేశ సంపదను కాపాడటంలో ఇథనాల్ ఉత్పత్తి కీలకపాత్ర పోషిస్తోందని ‘బీఈపీఏ’ అధ్యక్షుడు పుష్పేంద్ర సింగ్ తెలిపారు. మొక్కజొన్న వంటి పంటలకు పారిశ్రామిక గిరాకీ పెంచడం ద్వారా రైతులకు కనీస మద్దతు ధర కంటే లాభదాయకమైన ధర లభిస్తుందన్నారు.
అయితే, ఇథనాల్ విక్రయాల కేటాయింపుల్లో సమానత్వం ఉండాలని, ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలపై జీఎస్టీ తగ్గించాలని ఆయన కోరారు. ఇథనాల్ వాడకం వల్ల ఇంజన్లు దెబ్బతింటాయనే ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు.
Comments
Loading comments...