Back to feed
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఎబోలా అలర్ట్
Rohit Agarwal May 26, 2026 6:46 AM హైదరాబాద్ 20 views1 day ago

ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ కలకలం రేపుతున్న నేపథ్యంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు అప్రమత్తమయ్యారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయ ఆరోగ్య సంస్థ (APHO) ఆధ్వర్యంలో థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
వైరస్ లక్షణాలు ఉన్న వారిని గుర్తించేందుకు ఇంటర్నేషనల్ అరైవల్స్ వద్ద ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ వైరస్ సోకిన వారిలో మరణాల రేటు 50 శాతం ఉండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ఎమర్జెన్సీ ప్రకటించింది.
Comments
Loading comments...



