వార్తలకు తిరిగి వెళ్లండి
రామమందిర విరాళాల తో ప్రియురాలికి ఖరీదైన ఫోన్

Photo Gallery
అయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసులో సిట్ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగుచూశాయి. ప్రధాన నిందితుడు అవినాష్ శుక్లా తన ఖాతా నుంచి రూ.15 లక్షలకు పైగా నగదు లావాదేవీలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ చోరీ సొమ్ముతోనే తన స్నేహితురాలికి రూ.2 లక్షల నగదుతో పాటు ఓ ఖరీదైన స్మార్ట్ ఫోన్ బహుమతిగా ఇచ్చినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
ఆలయంలో విధులు ముగిశాక అవినాష్ నిత్యం భారీగా నగదు తెచ్చేవాడని అతని సోదరుడు తెలిపాడు. ఆ డబ్బును భక్తులు సంతోషంతో ఇచ్చారని మరో నిందితుడు అనుకల్ప్ బుకాయించినట్లు విచారణలో తేలింది. దీనిపై పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.
Comments
Loading comments...