Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామమందిర విరాళాల తో ప్రియురాలికి ఖరీదైన ఫోన్‌

లక్ష్మి దేవి Jul 05, 2026 3:28 PM అల్ ఇండియా 6 viewsabout 1 hour ago
రామమందిర విరాళాల తో ప్రియురాలికి ఖరీదైన ఫోన్‌ - Udayam Digital

Photo Gallery

రామమందిర విరాళాల తో ప్రియురాలికి ఖరీదైన ఫోన్‌ - main
రామమందిర విరాళాల తో ప్రియురాలికి ఖరీదైన ఫోన్‌ - gallery image
అయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసులో సిట్ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగుచూశాయి. ప్రధాన నిందితుడు అవినాష్ శుక్లా తన ఖాతా నుంచి రూ.15 లక్షలకు పైగా నగదు లావాదేవీలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ చోరీ సొమ్ముతోనే తన స్నేహితురాలికి రూ.2 లక్షల నగదుతో పాటు ఓ ఖరీదైన స్మార్ట్‌ ఫోన్‌ బహుమతిగా ఇచ్చినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఆలయంలో విధులు ముగిశాక అవినాష్ నిత్యం భారీగా నగదు తెచ్చేవాడని అతని సోదరుడు తెలిపాడు. ఆ డబ్బును భక్తులు సంతోషంతో ఇచ్చారని మరో నిందితుడు అనుకల్ప్ బుకాయించినట్లు విచారణలో తేలింది. దీనిపై పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.

Comments

G
Loading comments...