వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు పడిగాపులు కాస్తున్నారు. రద్దీ పెరగడంతో సర్వదర్శనానికి సుమారు 16 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు భక్తులతో పూర్తిగా నిండిపోయి, క్యూలైన్లు శిలాతోరణం వరకు వ్యాపించాయి.
ప్రస్తుతం వైకుంఠం క్యూకాంప్లెక్స్లో టైంస్లాట్ భక్తులు కూడా వేచి ఉన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ తెలిపింది.
Comments
Loading comments...

