వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
జార్ఖండ్లో కాలు ఫ్రాక్చర్తో ఆసుపత్రిలో చేరిన 18 ఏళ్ల రాజ్ అనే యువకుడు వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. గాయానికి సరైన డ్రెస్సింగ్ చేయకపోవడంతో ఇన్ఫెక్షన్ సోకి పరిస్థితి విషమించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
దాదాపు 40 రోజుల చికిత్సకు గానూ రూ.22 లక్షల బిల్లు వేయడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ ఘోర ఘటనపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
Comments
Loading comments...

