వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో పర్యాటక, పారిశ్రామిక రంగాల్లో కుదిరిన ఎంఓయూల అమలును వేగవంతం చేయాలని బాపట్ల కలెక్టర్ వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఎంఓయూల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.
రూ.852.16 కోట్ల పెట్టుబడులతో 12 ప్రాజెక్టులు రానున్నాయని, వీటి ద్వారా 1,435 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించనుందని తెలిపారు. సూర్యలంక, చీరాల కేంద్రంగా పలు ప్రాజెక్టులు ప్రతిపాదించినట్లు వివరించారు.
Comments
Loading comments...

