Back to feed
ఆయిల్ పామ్ సాగుపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి
Vikram Jun 19, 2026 8:38 AM యాదాద్రి భువనగిరి 2 viewsabout 3 hours ago

యాదాద్రి జిల్లాలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. ఈ పంట వల్ల రైతులకు దీర్ఘకాలికంగా అధిక ఆదాయం లభిస్తుందని ఆయన వివరించారు.
నాలుగో ఏట నుంచి వరుసగా 30 ఏళ్ల పాటు ఎకరానికి రూ. 1.50 లక్షల వరకు ఆదాయం పొందవచ్చని తెలిపారు. సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు రైతుల్లో అవగాహన కల్పించాలని ఉద్యాన అధికారులకు సూచించారు.
Comments
Loading comments...



