వార్తలకు తిరిగి వెళ్లండి
రూ.9,500 కోట్ల ఐపీఓకు కోకాకోలా సిద్ధం

ప్రముఖ శీతలపానీయాల సంస్థ కోకాకోలా తన భారతీయ బాటిలింగ్ యూనిట్ 'హిందుస్థాన్ కోకాకోలా బేవరేజెస్'ను ఐపీఓకు తీసుకురావాలని భావిస్తోంది. దీని ద్వారా దాదాపు రూ.9,500 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది.
ఇందుకోసం ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులను సంస్థ ఆహ్వానించింది. ఎల్జీ, హ్యుందాయ్ తరహాలోనే కోకాకోలా కూడా తన భారత అనుబంధ సంస్థను పబ్లిక్ ఇష్యూకు తీసుకురావడం గమనార్హం.
Comments
Loading comments...