వార్తలకు తిరిగి వెళ్లండి
స్టాక్ మార్కెట్లో వరుసగా రెండో రోజు నష్టాలు

ఐటీ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి మరియు అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 249 పాయింట్లు, నిఫ్టీ 80 పాయింట్ల మేర పతనమయ్యాయి.
ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి ఐటీ దిగ్గజాలు నష్టపోగా, మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు కొంత మెరుగ్గా రాణించాయి. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో మార్కెట్ లాభాలను అందుకోలేకపోయింది.
Comments
Loading comments...