వార్తలకు తిరిగి వెళ్లండి
వెలిగొండ ప్రాజెక్టును పరిశీలించనున్న సీఎం
మనీష్ రెడ్డి Jun 27, 2026 5:36 AM మార్కాపురం 2 viewsabout 2 hours ago

సీఎం చంద్రబాబు నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించి వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారు. నిర్వాసితులకు రూ. 905 కోట్ల ఆర్అండ్ఆర్ ప్యాకేజీని అందజేయడంతో పాటు, అక్కడ అభివృద్ధి పనుల పురోగతిని ఆయన స్వయంగా సమీక్షిస్తారు.
అనంతరం గిద్దలూరులో సంజీవని డిజిటల్ సర్వ్ పథకాన్ని సీఎం ప్రారంభిస్తారు. చిత్తూరులో పైలట్ ప్రాజెక్టుగా విజయవంతమైన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. పర్యటనలో భాగంగా ఆయన బహిరంగ సభలోనూ ప్రసంగిస్తారు.
Comments
Loading comments...