వార్తలకు తిరిగి వెళ్లండి
మాధవరంలో సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు
పార్వతి దేవి Jun 23, 2026 9:46 AM కర్నూలు 7 viewsabout 2 hours ago

ఈ నెల 25న మంత్రాలయం మండలం మాధవరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ ఏ. సిరి, ఎస్పీ విక్రాంత్ పటేల్తో కలిసి హెలిప్యాడ్, సభా వేదిక, బారికేడింగ్ వంటి పనులను పర్యవేక్షించారు.
సీఎం పర్యటన విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. భద్రత, తాగునీరు, పార్కింగ్ వంటి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
Comments
Loading comments...