వార్తలకు తిరిగి వెళ్లండి
కన్వర్, చార్ధామ్ యాత్రలకు పకడ్బందీ ఏర్పాట్లు

ఉత్తరాఖండ్లో కన్వర్ యాత్రకు సర్వం సిద్ధం చేశామని సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. హరిద్వార్, రిషికేశ్ వచ్చే శివభక్తుల కోసం భద్రత, తాగునీరు, బస తదితర పూర్తి ఏర్పాట్లు చేశామన్నారు. మరోవైపు, ఈ ఏడాది చార్ధామ్ యాత్ర సరికొత్త రికార్డులు సృష్టించిందని, ఇప్పటికే సుమారు 45 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని వెల్లడించారు.
రుతుపవనాల కారణంగా వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ, యాత్రికుల భద్రతే ప్రాధాన్యంగా యాత్రను నిరంతరాయంగా కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. పవిత్రమైన కుంభమేళాకు కూడా ఇప్పటినుంచే సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...