వార్తలకు తిరిగి వెళ్లండి
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి

వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం కేంద్ర మంత్రి భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు.
Comments
Loading comments...