Back to feed
జ్ఞాపకాలు కోల్పోతే ఆ ప్రేమ దక్కేనా?
Priya Singh Jun 16, 2026 4:56 AM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago

విరాజ్ అశ్విన్, యశశ్రీ రావు జంటగా నూతన ఓటీటీ సిరీస్ ‘గుర్తుకొస్తున్నాయి’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. వినోద్ గాలి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారమ్ ఈటీవీ విన్ వేదికగా జులై 3 నుంచి ప్రసారం కానుంది.
పెళ్లికి ముందు ప్రమాదంలో జ్ఞాపకాలు కోల్పోయిన యువకుడు, తన ప్రేమను తిరిగి పొందేందుకు చేసిన భావోద్వేగ పోరాటం నేపథ్యంలో ఈ సిరీస్ సాగుతుంది. ఆహ్లాదకరమైన సంభాషణలతో కూడిన ఈ చిత్ర టీజర్ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది.
Comments
Loading comments...



