వార్తలకు తిరిగి వెళ్లండి
సరిహద్దు భద్రతపై ఎస్సీవో చర్చలు

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో ఎస్సీవో దేశాల సరిహద్దు సేవల విభాగాల అధిపతుల 12వ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సదస్సుకు భారత్, పాక్, చైనా, రష్యాలతో పాటు పలు దేశాల అధికారులు హాజరయ్యారు.
అంతర్జాతీయ సరిహద్దుల్లోని తాజా పరిస్థితులు, భవిష్యత్తులో చేపట్టబోయే ఉమ్మడి అభివృద్ధి పనులపై సభ్య దేశాలు సమాచారాన్ని పరస్పరం పంచుకున్నట్లు పాక్ విదేశాంగ శాఖ వెల్లడించింది.
Comments
Loading comments...