వార్తలకు తిరిగి వెళ్లండి
యూపీలో మళ్లీ కమల వికాసం: నితిన్ నబిన్

Photo Gallery
ఉత్తరప్రదేశ్లో 2027 ఎన్నికల్లో మళ్లీ కమలం వికసిస్తుందని, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల కోసం పార్టీ శ్రేణులు ఇప్పటికే సర్వసన్నద్ధమయ్యాయని ఆయన పేర్కొన్నారు.
మహాసంగ్రామానికి క్యాడర్ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తోందని, క్షేత్రస్థాయిలో పార్టీ బలం స్పష్టంగా కనిపిస్తోందని నబిన్ చెప్పారు. సంక్షేమ పథకాలు, క్షేత్రస్థాయి వ్యూహాలతో రాబోయే ఎన్నికల్లో భారీ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Loading comments...