Back to feed
రక్తదానంపై మంత్రి దామోదర కీలక పిలుపు!
Rohit Singh Jun 14, 2026 9:41 AM హైదరాబాద్ 31 views1 day ago

సాంకేతికత ఎంత పెరిగినా రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేమని, రక్తదానం మాత్రమే ప్రాణాలను కాపాడే మార్గమని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, ప్రసవాలు మరియు వివిధ దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సలో రక్తం ఎంతో మంది ప్రాణాలను నిలబెడుతుందని ఆయన తెలిపారు.
ఈ నేపథ్యంలో దేశ యువత దీనిని ఒక సామాజిక బాధ్యతగా భావించి, స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావలసిన అవసరం ఎంతైనా ఉందని ఆరోగ్య శాఖ మంత్రి పిలుపునిచ్చారు.
Comments
Loading comments...



