వార్తలకు తిరిగి వెళ్లండి
'బేటా బచావో'గా మారిన బీజేపీ నినాదం: కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు

కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. 'బేటీ బచావో' నినాదం కాస్తా ఇప్పుడు 'బేటా బచావో'గా మారిందని ఎద్దేవా చేశారు. నిందితుడిని రక్షించేందుకు బీజేపీ, కాంగ్రెస్లు చేతులు కలిపాయని విమర్శించారు.
మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగిన కేసులో నిందితుడిని తప్పించేందుకు ప్రభుత్వం సహకరిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణలో జరుగుతున్న ఈ పరిణామాలు అత్యంత దారుణమని ఆయన తన ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు.
Comments
Loading comments...