వార్తలకు తిరిగి వెళ్లండి
డబుల్ డబ్బు ఆశ చూపే మోసాల పట్ల అప్రమత్తత
శివ కుమార్ Jun 27, 2026 6:22 AM గుంటూరు 3 viewsabout 2 hours ago

నగరంపాలెం సీఐ సత్యనారాయణ ప్రజలను ఆర్థిక మోసాల పట్ల హెచ్చరించారు. అనుమతులు లేని చిట్ఫండ్ సంస్థల ఆశ చూపే "అధిక లాభాల" మాయలో పడొద్దని సూచించారు. పెట్టుబడి పెట్టే ముందు సదరు సంస్థకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయో లేదో తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని ఆయన కోరారు.
చట్టవిరుద్ధంగా చిట్టీలు నిర్వహిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండి తమ కష్టార్జితాన్ని కాపాడుకోవాలని సీఐ సూచించారు.
Comments
Loading comments...