వార్తలకు తిరిగి వెళ్లండి
అయోధ్య విరాళాల కేసు: నిందితుల తరపున వాదిస్తే రూ. 5 లక్షల జరిమానా

రామాలయ విరాళాల దుర్వినియోగం కేసులో నిందితుల తరపున ఎవరూ వాదించకూడదని అయోధ్య బార్ అసోసియేషన్ నిర్ణయించింది. ఉల్లంఘిస్తే రూ. 5 లక్షల జరిమానా విధిస్తామని, ఈ కేసులో సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేసింది.
నిందితులుగా ఆరోపణలున్న చంపత్ రాయ్, అనిల్ మిశ్రా వెంటనే నగరాన్ని విడిచి వెళ్లాలని బార్ హెచ్చరించింది. లేనిపక్షంలో నిరసనలు ఉధృతం చేస్తామని అధ్యక్షుడు కాలికా ప్రసాద్ మిశ్రా స్పష్టం చేశారు.
Comments
Loading comments...