వార్తలకు తిరిగి వెళ్లండి
విలేకరిపై దాడి: మెదక్ జర్నలిస్టుల నిరసన
శ్రీజ రెడ్డి Jun 23, 2026 10:35 AM మెదక్ 6 viewsabout 3 hours ago

నార్సింగి మండల విలేకరి శ్రీ రాఘవేందర్ పై జరిగిన దాడిని మెదక్ జిల్లా జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలను వెలికితీసే జర్నలిస్టులపై దాడులు చేయడం పత్రికా స్వేచ్ఛకు విఘాతమని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ జర్నలిస్టులు కలెక్టర్, ఎస్పీలకు వినతిపత్రాలు సమర్పించారు. దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...