వార్తలకు తిరిగి వెళ్లండి

గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిర్వీర్యమైన టూరిజం రంగాన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని ఏపీటీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ తెలిపారు. పర్యాటక రంగంలో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు, 1.22 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమని వివరించారు.
గోవా తరహాలో బీచ్ షాక్స్ పాలసీని ప్రవేశపెడుతున్నామన్న ఆయన, రాష్ట్రంలోని 20 బీచ్లకు అంతర్జాతీయ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని, పర్యాటకులకు పటిష్టమైన భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

