వార్తలకు తిరిగి వెళ్లండి
పీఎం ఫ్యామిలీ కేర్ ట్రాకర్ పైలట్ ప్రాజెక్ట్ను ప్రారంభించిన అమిత్ షా

కేంద్ర హోం మంత్రి అమిత్ షా గాంధీనగర్లో 'పీఎం ఫ్యామిలీ కేర్ ట్రాకర్'ను ప్రారంభించారు. గర్భధారణ నుండి 18 ఏళ్ల వరకు పిల్లల ఆరోగ్యం, పోషకాహారం, విద్యను ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ పర్యవేక్షిస్తుంది.
దీని ద్వారా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను లబ్ధిదారులకు నేరుగా చేరవేస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలకు 'హెల్త్ పాస్పోర్టుల'ను విడుదల చేయడంతో పాటు, పీఎం ఈ-బస్ సర్వీసులను అమిత్ షా జెండా ఊపి ప్రారంభించారు.
Comments
Loading comments...