వార్తలకు తిరిగి వెళ్లండి
అమర్నాథ్ భక్తులకు కేబుల్ కార్ ప్రాజెక్టు

అమర్నాథ్ యాత్రను సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన కేబుల్ కార్ ప్రాజెక్టును చేపట్టనుంది. 13 వేల అడుగుల ఎత్తులో ఉన్న మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు డొమైల్ గేట్ నుండి బల్తాల్ రూట్ ద్వారా 2029 నాటికి దీనిని అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళికలు రచిస్తోంది.
సుమారు 11.6 కిలోమీటర్ల పొడవున నిర్మించే ఈ రోప్వే ప్రాజెక్టు ద్వారా భక్తుల ప్రయాణ సమయం 5 నుండి 8 గంటల నుండి ఏకంగా 25 నుండి 30 నిమిషాలకు తగ్గిపోనుంది.
Comments
Loading comments...