వార్తలకు తిరిగి వెళ్లండి
అమరావతి రాజధాని గ్రామాల పరిధిలో అనుమతులు లేకుండా నల్ల మట్టిని తరలిస్తున్న రెండు టిప్పర్లను తుళ్లూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెంకటపాలెం వెస్ట్ బైపాస్ వద్ద వాహనాలను తనిఖీ చేసి, అక్రమ రవాణాను గుర్తించామని ఎస్సై మురళీధర్ తెలిపారు.
నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. అనుమతి లేకుండా ఖనిజ సంపదను తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...

