వార్తలకు తిరిగి వెళ్లండి

యాదగిరిగుట్టలో స్వామివారి జయంతి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉదయం సహస్ర కలశాభిషేకం, హోమాలు శాస్త్రోక్తంగా నిర్వహించగా, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం నారసింహ నామస్మరణతో మార్మోగింది.
సాయంత్రం ఆవిర్భావ ఘట్టంతో వేడుకలు పరిసమాప్తమయ్యాయి. ఈవో భవానీ శంకర్ పర్యవేక్షణలో ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. పవిత్ర జయంతి వేళ క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది.
Comments
Loading comments...
