వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనం కోసం 30 కంపార్ట్మెంట్లలో భక్తులు నిరీక్షిస్తుండగా, దర్శనానికి దాదాపు 12 గంటల సమయం పడుతోంది. రూ.300 శీఘ్రదర్శనం భక్తులకు 3-4 గంటల నిరీక్షణ తప్పడం లేదు. రద్దీ దృష్ట్యా టీటీడీ అధికారులు క్యూలైన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
నిన్న 79,878 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ.3.94 కోట్లుగా నమోదైంది. 33,037 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.
Comments
Loading comments...

