వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించే ప్రత్యామ్నాయ మార్గాలపై ఐఐటీ హైదరాబాద్, ఆర్వీ అసోసియేట్స్ సమర్పించిన నాలుగు ప్రతిపాదనలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షించారు.
ఈ ప్రతిపాదనలపై నేడు సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేక భేటీ జరగనుంది. ప్రాజెక్టు వ్యయం, లాభనష్టాలను చర్చించి, త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
Comments
Loading comments...

