Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

తెలంగాణలో ఇంటింటి సర్వే: మే 11 నుంచే గణన ప్రక్రియ ప్రారంభం!

Udayam Digital Staff Apr 25, 2026 8:43 AM హైదరాబాద్ 4 views14 days ago
తెలంగాణలో ఇంటింటి సర్వే: మే 11 నుంచే గణన ప్రక్రియ ప్రారంభం! - Udayam Digital
తెలంగాణలో జనగణన ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ఆస్పత్రులు, అద్దె ఇళ్లు సహా ప్రతి భవనాన్ని లెక్కిస్తామని జనగణన డైరెక్టర్ భారతీ హోళికెరి తెలిపారు. మే 11 నుంచి జూన్ 9 వరకు ఇళ్ల గణన ప్రక్రియ జరుగుతుందని, ఇందుకోసం ఎన్యుమరేటర్లను నియమించామని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో భవనాలపై గుర్తులు వేసి కుటుంబ వివరాలను నమోదు చేస్తారు. 2027 ఫిబ్రవరి నుంచి రెండో దశలో వ్యక్తిగత సమాచార సేకరణ చేపడతామని ఆమె వెల్లడించారు.

Comments

G
Loading comments...