వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ గురుకుల కాలేజీలు, కేజీబీవీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీఆర్జేసీ సెట్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ పరీక్షకు 77.77 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని కన్వీనర్ రమణకుమార్ వెల్లడించారు.
మొత్తం 76,174 మందికి గానూ 59,244 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. పకడ్బందీ ఏర్పాట్ల మధ్య ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రక్రియ విజయవంతమైంది.
Comments
Loading comments...

