వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షోరూమ్లో ఆదివారం ఉదయం దుండగులు సాహసోపేతమైన దోపిడీకి పాల్పడ్డారు. కస్టమర్ల ముసుగులో వచ్చి తుపాకులతో బెదిరించి, నాలుగు రౌండ్ల కాల్పులు జరిపి భారీగా బంగారాన్ని దోచుకెళ్లారు. ఈ దాడిలో నలుగురు సిబ్బంది గాయపడగా, తీవ్రంగా గాయపడిన మధుకర్ అనే వ్యక్తిని హైదరాబాద్కు తరలించారు.
నిందితులు పారిపోతూ వదిలేసిన మ్యాగజైన్, బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టపగలే జరిగిన ఈ ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

